12 June, 2026 | 11:46 AM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్‌నకు బయలుదేరిన అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు

29-10-2025 12:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీకి చెందిన టి. అజయ్ విక్రమ్, ఎస్. పూర్ణశ్రీ అనే ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీ, పాటన్, గుజరాత్‌లో జరగనున్న ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా విశ్వవిద్యాలయ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.

ఈకార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ వి. విజయ్ కుమార్,  ఎంఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు సంతోష్ కుమార్, టి. పురుషోత్తమ్ పాల్గొన్నారు. వారు ఈ విజయంపై వాలంటీర్లను అభినందిస్తూ, రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ వైపు తదుపరి పెద్ద అడుగుగా మరింత ఉన్నత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.