1 July, 2026 | 6:41 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

తెలంగాణ వాసికి ఏపీ సీఎం చేయూత

17-05-2025 12:51 AM

సిఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు 

మహబూబాబాద్, మే 16 (విజయ క్రాంతి): తెలంగాణ వాసికి ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్య క్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు.

ఈ విష యాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ టిడి పి కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన సందర్భంగా ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని వివరించి అతనికి ఆర్థిక సాయం అందించాలని కోరగా, ఆ మేరకు సీఎంఆర్‌ఎఫ్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు.

మీ మేర కు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి జారీ అయిన చెక్కును బాధితుడికి రామచంద్రరా వు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుతారపు వెంకటనారాయణ, ప్రేమ్చంద్ వ్యాస్, పిట్టల రాము తదితరులు పాల్గొన్నారు. .