calender_icon.png 15 June, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

14-06-2025 12:00:00 AM

రాజీ మార్గమే రాజ మార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్

నాగర్ కర్నూల్ జూన్ 13 ( విజయక్రాంతి ): చాలా కాలంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, పిట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్సైజ్, ఎలక్ట్రిసిటీ కేసులు సాధ్యమైనంత వరకు ఇరుపక్షాలు పంతాలు పట్టింపులను వీడి రాజీమార్గం ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్ అదాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్ తెలిపారు.

ఈనెల 14న శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్ర మం సందర్భంగా జిల్లాలోని ఆయా కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలిసి తెలియక చేసిన తప్పులకు శిక్షణ అ నుభవిస్తున్న ముద్దాయిలు వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి ప్రభుత్వమే ఉచిత న్యాయ సేవలు అం దించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

లోక్ అదాలత్ ద్వారా కేసులు సెటిల్ అయితే ఇరు పక్షాలు సంతోషిస్తాయని, అప్పీలు లేని తీర్పును పొంది సమయాభావం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. భూములకు సంబంధించిన సివిల్ కేసుల్లో ఇరుపక్షాలు రాజీ కుదిరితే కోర్టు ఫీజు వాపస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వారితోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నసీం సుల్తానాఉన్నారు.