calender_icon.png 9 June, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులో అనేక భూసమస్యలపై దరఖాస్తులు

05-06-2025 12:46:34 AM

ఘట్ కేసర్, జూన్ 4 (విజయక్రాంతి) : ఉమ్మడి ఘట్కేసర్ మండలంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో అనేక భూ స మస్యలపై దరఖాస్తులు అందుతున్నాయి. బుధవారం ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని  కొర్రెముల, కొండాపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు జరిగాయి. కొర్రెము లలో 68, కొండాపూర్ లో 25 దరఖాస్తులు అందినట్లు రెవె న్యూ అధికారులు  తెలిపారు.

రైతులు తమ సమస్యలను సం బంధిత ఫారాల ద్వారా అధికారులకు తెలియజేయవచ్చన్నా రు. గ్రామస్తులు ఊరు దాటక్కర్లేదు. కాలు కదపక్కర్లేదు. భూ భారతి ద్వారా మీ భూసమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తం గా భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిందని అంతకుముందు న్న ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇక ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరకే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళ్తుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. ఆగస్టు 15 నాటికి ఆ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు. ఇక దీని కోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు. గ్రామాల్లో జరిగే భూ భారతి సద స్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు ఆయా ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫా రం నింపి అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు. జూన్ 20 తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, డిప్యూటీ తహసిల్దార్ రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ , డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నాగరాజు, వెంకటేష్, రేసు లక్ష్మారెడ్డి, నాయకులు శేఖర్, రాజి రెడ్డి, రాంరెడ్డి, రవీందర్, రెవిన్యూ సిబ్బంది, రైతులు,  పాల్గొన్నారు.