19-05-2025 11:20:21 PM
కొండపాక: బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి(District Collector Manu Chowdhury) ఆదేశించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులు దరఖాస్తులు చేసుకున్నారు. బాధితుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, వివిధ శాఖల అధికారులతో కలసి మొత్తం 69 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్ డి ఏ పిడి జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు పాల్గొన్నారు.