4 July, 2026 | 8:50 PM

Breaking News

కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •  

సొసైటీలకు పీఐసీల నియామకం

18-09-2025 01:27 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): పనితీరు సరిగా లేని సొసైటీల పాలక మండలి స్థానంలో ప్రభుత్వం కొత్తగా (పర్సన్ ఇంచార్జ్) పీఐసీలను నియమించిందని మహబూబాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విధంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, తొర్రూర్, కురవి, నెల్లికుదురు, బయ్యారం సొసైటీల పాలక మండలి స్థానంలో పర్సన్ ఇన్చార్జిలను నియమించినట్లు ఆయన తెలిపారు.

సహకార శాఖ సహాయ అధికారులను ఆయా సొసైటీలకు పర్సన్ ఇన్చార్జిగా నియమించినట్లు చెప్పారు. కేసముద్రం పర్సన్ ఇన్చార్జిగా ప్రవీణ్, బయ్యారంకు ఆదినారాయణ, కురవికి సుమలత, నెల్లికుదురుకు మనోహర్ రావు, తొర్రూరుకు రమేష్ నియమితులైనట్లు ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో 19 సొసైటీలు ఉండగా, ప్రభుత్వం సొసైటీల పనితీరు నిర్దేశించడానికి రూపొందించిన విధానాల మేరకు ఐదు సొసైటీల నిర్వహణ లేకపోవడం వల్ల పాలకమండళ్లకు పొడగింపు ఇవ్వకుండా పర్సన్ ఇన్చార్జిలను నియమించినట్లు డీసీఓ తెలిపారు.