30-06-2025 02:49:24 AM
సూర్యాపేట, జూన్ 29 (విజయక్రాంతి): ఉద్యమం నుంచి వచ్చినోళ్లకు కేసులంటే భయం ఉండదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయ న మీడియాతో మాట్లాడారు. మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసేందుకే దాడులు జరుగుతున్నాయని, తె లంగాణాను ఆంధ్ర నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్పై కుట్ట లు చేస్తున్నారని ఆరోపించారు.
మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చంద్రబాబు, రేవంత్లను చూసి మురిసేటోళ్లను భవిష్యత్తులో ఎవరు కాపాడలేరని హెచ్చరించారు. తమ పిటిషన్లపై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి తమపైనే తప్పుడు కేసు లు పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలపై మీడియా అసత్య ప్రచారాలు చేయడం సరి కాదన్నారు. మహా న్యూస్పై జరిగినది దాడి కాదని, కేవలం నిరసన మాత్రమేనన్నారు. మీడియా ముసుగులో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకోరన్నారు.
భేషరతుగా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీళ్ల విషయంలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులకు కనీసం అవగాహన లేదని, పాలన చేతకాక కేసీఆర్ణు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ నీళ్లు తెచ్చే పరిస్థితి కనిపించడంలేదన్నారు.