01-12-2025 09:41:56 PM
మంథని (విజయక్రాంతి): మంథని నూతన తహసీల్దార్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎండీ ఆరిఫోద్దిన్ ను తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం టీయూఎఫ్ అధ్వర్యంలో కలిసి సన్మానం చేశారు. మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంథని విజయ్ కుమార్, బిజెపి పార్టీ మంథని మాజీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్, బిజెపి పార్టీ మాజీ పట్టణ ఉపాధ్యక్షులు గుడ్ల గురువేష్, దళిత నాయకులు దాసరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.