calender_icon.png 29 October, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం

29-10-2025 12:45:11 AM

-ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ పూర్తి

-నగరంలో ఐదు చోట్ల ట్రయల్స్

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశ రాజధాని ఢిల్లీ లో తీవ్ర వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. వాయు కాలుష్య నివారణకు స్థానికం గా కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైం ది. ఇందులో భాగంగా ‘క్లౌడ్ సీడింగ్’ ప్రక్రియను పూర్తి చేసింది. ఐఐటీ కాన్పూర్ నుంచి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసా యన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల్లోని మేఘాలపై చల్లి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసింది.

దీంతో మరికొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం ఉంది. నగరంలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అక్టోబర్ 1 నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ట్రయల్స్ నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అనుమతి చ్చింది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి కావాల్సిన రూ.3.21 కోట్ల బడ్జెట్‌ను ఢిల్లీ మంత్రివర్గం మేలో ఆమోదించింది. అయితే ప్రతికూల వాతావరణం, రుతుపవన పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదాపడింది. కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రజలు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి పండుగ పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. మంగళవారం వాయు నాణ్యత సూచీ 306గా నమోదవడం ఆందోన కలిగిస్తున్నది.