భద్రకాళి బండ్‌పై ‘ఆరూరి’ ప్రచారం

28-04-2024 12:55:13 AM

వరంగల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్‌పై శనివారం ఉదయం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్‌తో ముచ్చటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పదేండ్ల మోడీ పాలనలో దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందని కొనియాడారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ప్రభారి మురళీధర్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గజ్జెల శ్రీరాములు, రావుల కిషన్ పాల్గొన్నారు.