జహీరాబాద్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జహీరాబాద్ పట్టణంలో శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నియోజకవర్గ పార్టీ కార్యాల యంలో బీఆర్ఎస్ జెండాను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైపల్యాలను గడప గడపకు వెళ్లి వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలను చైతన్య పరిచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యమకారుడు గాలి అనీల్కుమార్ను భారీ మెజార్టీ తో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, నాయకులు నామ రవికిరణ్, గుండ ప్ప, తంజీం, యాకుబ్, నారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు.