10-06-2025 12:00:00 AM
చర్ల, జూన్ 9 (విజయ క్రాంతి): చర్ల సరిహద్దు రాష్ర్టమైన ఛత్తీస్గఢ్లోని సుక్మా జి ల్లాలో సోమవారం మావోయిస్టులు పో లీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ప్రమాదంలో జిల్లా అదనపు ఎస్పీ ఆకాశ్ రా వు గిర్పుంజే మృతి చెందగా.. ఆయన వెంట వచ్చిన అధికారులు సహా ఇద్దరు జవాన్లు తీ వ్రంగా గాయపడ్డారు.
బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల మేరకు.. మ ంగళవారం మావోయిస్టు పార్టీ ‘భారత్ బ ంద్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఎస్పీ ఆ కాశ్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజూమున కొంటా రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో సిబ్బందితో క లిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే భద్రతా బలగాలను నిలువరించేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు ఐ ఈడీతో ఏఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.
దీంతో తీవ్రంగా గా యపడిన ఏఎస్పీ ఆకాశ్రావును ఎయిర్లిఫ్ట్ ద్వారా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొ ందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక అధికారులు ఎస్డీవోపీ భాను ప్రతాప్ చ ంద్రకర్, టీఐ సోనాల్ గ్వాల్, ఇద్దరు జవాన్లను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించారు.
అదనపు ఎస్పీ ఆకాశ్రావు మృత్యువార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడసారి ఆయన్ను చూసేందుకు ప్రజలు ఆయన నివాసానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆకాశ్రావు అంత్యక్రియలు రాయ్పూర్లో మంగళవారం ని ర్వహించున్నట్టు అధికారులు తెలిపారు.