22-07-2025 12:00:00 AM
కామారెడ్డి, జూలై 21 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం 25 సీసీ టీవీ కెమెరాలను కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జీవధాన్ హాస్పిటల్ నుంచి వసుంధర వెంచర్ వరకు రోడ్డు ఇరువైపులా సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పీసీసీ టీవీ కెమెరాలను వసుంధర వెంచర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు ఏ ఎస్ పి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి సిఐ రామన్, ఎస్త్స్ర పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.