7 May, 2026 | 2:16 PM

Breaking News

పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •  

కార్గిల్ అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళ్లు

26-07-2025 09:03 PM

కోరుట్ల,(విజయక్రాంతి): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కోరుట్ల  పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద కార్గిల్ అమరవీరులకు కొవ్వతులతో నివాళులర్పించిన కోరుట్ల బిజెపి నాయకులు. 1999లో భారత వాస్తవాధీన రేఖలు దాటి ప్రదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని 80 రోజుల పాటు వీరోచితంగా పోరాడి జులై 26న ఆపరేషన్ విజయ్ ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సైన్యం. ఈ యుద్ధంలో ప్రాణాలర్పించిన 527 మంది వీర సైనికుల ధైర్య, సాహసాలను త్యాగాన్ని గుర్తు చేసుకుని నివాళులర్పించిన బిజెపి నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నరేష్, గణేష్, జిల్లా నాయకులు మహేష్, సాగర్, రాచమడుగు శ్రీనివాస్ రావు, గిన్నెల శ్రీకాంత్, బ్రహ్మం, ఉదయ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు