23-11-2025 10:59:34 PM
భీమిని: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్ళను పట్టుకున్నట్టు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమిని గ్రామంలో డబ్బులు పందంగా పెట్టి పేకాట ఆడుతున్నారని వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు భీమిని గ్రామనికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని భీమిని ఎస్ఐ ఎం. విజయ్ కుమార్ తెలిపారు. ఆరుగురిని పట్టుకొని వారి దగ్గర నుండి 52 పేక ముక్కలు, 6 సెల్ ఫోన్లు, రూ. 7500 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీస్ సిబ్బంది ప్రవీణ్ కుమార్ తో కలిసి ఈ పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నామని తెలిపారు.