4 July, 2026 | 10:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

బాలుడిపై హత్యాయత్నం

01-08-2025 12:40 AM

మహబూబాబాద్, జూలై 31 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్ శిరీష దంపతుల కుమారుడు ఆరేళ్ల వయసు గల మనీష్ కుమార్ పై గురువారం తెల్లవారుజామున దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఇంట్లో తల్లిదండ్రులు, నాయనమ్మ తో కలిసి నిద్రిస్తున్న మనీష్ కుమార్ మెడ పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దీనితో అతని మెడపై తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనతో బాలుడు కేకలు వేయడంతో నాయనమ్మ నిద్ర నుండి మేలుకొని తల్లిదండ్రులను కూడా లేపడంతో వెంటనే బాలున్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. తనకు ఎవరితోని ద్వేషాలు లేవని, తన కొడుకును ఎందుకు చంపాలనుకుంటున్నారో కూడా తెలియదని తల్లిదండ్రులు చెబుతుండగా, ఇంటి తలుపు గడియ లేని విషయం దుండగులకు ఎలా తెలుసుకున్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ఘటనపై మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం రెండవ ఎస్ ఐ  నరేష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలున్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పరామర్శించారు. ఘటనకు పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అభం శుభం ఎరుగని బాలుడి పై దాడికి పాల్పడ్డ ఘటన ఆ గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది.