27-05-2025 12:29:42 AM
మరొక అటెండర్కు గాయాలు
కామారెడ్డి, మే 26,(విజయ క్రాంతి): వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ విద్యుత్షాక్ తగలడంతో ఓ అంటెడర్ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని బిసి బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు బీసీ బాలుర గురుకుల పాఠశాలో వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న బోరు మోటర్ చెడిపోవడంతో బోర్ మోటర్ తీసేందుకు ఇనుప పైపులు వాడుతూ పైకి లేపడంతో విద్యుత్ ఇనుప వైపుకు విద్యుత్ షాక్ రావడంతో గురుకుల పాఠశాల అటెండర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మరొక అటెండర్ కు గాయాలయ్యాయి. గురుకుల పాఠశాల అధ్యాపకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల వసతి గృహంలో అటెండర్ దోమకొండ లింగం(38), రాజుకుమార్ లు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన గురుకుల పాఠశా లలో అటెండర్లుగా పనిచేస్తున్నారు.
సోమ వారం ఇద్దరు పాఠశాలలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి లింగం మృతి చెందాడు. రాజు కుమార్కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బిక్క నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల కోసం నీటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న తరుణం లో అటెండర్ లింగం విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొక అటెండర్ రాజకుమార్ కు గాయాల య్యాయి. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కనూర్ పోలీసులు తెలిపారు.