29-05-2025 10:53:41 PM
మంచిర్యాల: 2024-25 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పెరిక ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గురువారం ఓవర్ బ్రడ్జి సమీపాన గల శిశుమందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ, విద్యా సంస్థల అధినేత అప్పని తిరుపతిలు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శాలువాలు, మెమొంటోలు అందజేసి ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పెరిక ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెట్టం తిరుపతి, ప్రధాన కార్యదర్శి అంకతి తిరుపతి, కార్యవర్గ సభ్యులు తోట తిరుమలేష్, గోళ్ల రామన్న, ఆకిరెడ్డి శంకర్, అంకతి మల్లేష్, సభ్యులు ముత్యం బుచ్చన్న, ముత్యం నారాయణ, ముత్యం నాగ వర్మ, కందుల తిరుపతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.