30-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ ధ్వజం
లక్షేట్టిపేట, మే 29: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే గా రద్దు చేయడమేనా నీ పని అంటూ ఎమ్మె ల్యే ప్రేమ్సాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ధ్వజమెత్తారు. గురువారం లక్షేటిపేట మున్సిపాలిటీలో పర్యటించిన ఆయ న ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, మినీ స్టేడియం లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న హామీలను మాత్రం నెరవేర్చడం లేద న్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులనే స్థానిక ఎమ్మెల్యే పరిశీ లిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారె కానీ కొత్తగా వారు ప్రజలకు చేసిందేమి లేదన్నా రు. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 297 పనులను రూ. 30 కోట్లతో చేపట్టి పూర్తి చేసే క్రమంలో నేడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయా పనులను రద్దు చేయాలని అధికారులను బెదిరించడం ఎంతవరకు న్యాయమన్నారు.
ముఖ్యంగా టెండర్లు లేకుండా ఎక్కువ మొ త్తానికి పనులు చేపట్టి ప్రతి పనిలో 5 శాతం కమీషన్ తీసుకుంటున్న ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు చరిత్రలో నిలిపోతారని ఏద్దేవా చేశారు.దోచుకో, దాచుకో అనే రీతిలో ఎమ్మె ల్యే ప్రేమ్ సాగర్ రావు పనులు ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్,అంబేద్కర్ చౌరస్తా నుంచి గోదావరి వరకు రోడ్, పలు సీసీ రోడ్లు, సెం ట్రల్ లైటింగ్,కమ్యూనిటీ హాల్స్ కు నిధులు ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడి పెల్లి విజిత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ ఫుడ్ పోదేటి శ్రీనివ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.