calender_icon.png 20 August, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దికుంట గ్రామంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల మీద అవగాహన కార్యక్రమం

20-08-2025 05:52:08 PM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో బుధవారం రైతువేదికలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  భాగంగా ఖరీఫ్ పంటలలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులపైన  కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం వారు అవగాహన  కల్పించడం జరిగింది. అదే విధంగా ఆయిల్ పామ్ పంటల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమం లో భాగంగా పండ్లు, కూరగాయలు, పూలను పెంచే రైతులకు ఉద్యాన శాఖ రాయితీలను అందిస్తుందని తెలిపారు. అదే విధంగా ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి 50 వేల సబ్సిడీ ని అందిస్తుందని సదాశివపేట  ఉద్యాన అధికారి సునీత తెలిపారు.