05-12-2025 07:13:06 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు.