05-04-2025 04:50:32 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటిగా ఇతర పోలీసు అధికారులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతలకు ఎదురు చెబుతూ అనగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘసంస్కర్త అని విద్యా,వ్యవసాయం,రక్షణ,కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన గొప్ప వ్యక్తి అని,కుల రహిత సమాజం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం,సోదరభవం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలన్నారు.