5 May, 2026 | 8:33 PM

Breaking News

మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •  

అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతం

17-03-2026 12:37 AM

మఠంపల్లి, మార్చి 16 : మండలంలోని బక్కమంతులగూడెం సెక్టార్ పరిధిలోని కొత్త దొనబండ తండా అంగన్వాడి టీచర్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో సోమవారం గర్భిణీకి శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్త దొనబండ తండా సర్పంచ్ బాణోతు అరుణా దేశ్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అన్నప్రసన్న, అక్షరభ్యాసం,

శ్రీమంతం, పుట్టిన రోజు వేడుకలు లాంటి కార్యక్రమాలను అంగన్వాడి సెంటర్లో నిర్వహించుకోవాలన్నారు. గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాల కు సహకరించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి సూచించారు.ఈ కార్యక్రమంలో కాల్వపల్లి తండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతసక్రు నాయక్, కార్యదర్శి నరేష్, డీలర్ మాలోతు లక్ష్మి,అంగన్వాడీ ఆయాలు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.