09-08-2024 03:00:32 PM
జైళ్లో ఉంచాల్సిన అవసరం ఏముంది?
కవిత జైల్లో 11 కిలోల బరువు తగ్గారు: కేటీఆర్
హైదరాబాద్: ఛార్జిషీట్ వేశాక ఇంకా జైళ్లో ఉంచాల్సిన అవసరం ఏముంది? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ వస్తుందని అనుకుంటున్నానని వెల్లడించారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతోందన్నారు. కవితకు వచ్చేవారం బెయిల్ వస్తుందని తెలిపారు. కవిత జైల్లో 11 కిలోల బరువు తగ్గారు, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ చెప్పారు.