09-08-2024 03:23:12 PM
సుంకిశాల ఘటనకు బాధ్యత ముఖ్యమంత్రిదే
హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాలను పట్టించుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. సుంకిశాల ప్రమాదం జరిగినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సుంకిశాల ప్రమాదం గురించి సభలో ఎందుకు ప్రకటన చేయలేదు..?, విపత్తు జరిగిన విషయం ప్రభుత్వానికి తెలియదా..? తెలిసి కూడా నొక్కి పెట్టారా..? కేటీఆర్ ప్రశ్నించారు. వద్దని వారించినా ఒత్తిడితో గేట్లు బిగించారని ఇంజినీర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. హడావుడి పనులతోనే సుంకిశాల ప్రమాదం జరిగిందన్నారు. ఇంజినీర్ల పర్యవేక్షణ, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా పనులు చేపట్టారని విమర్శించారు. సుంకిశాల ఘటనకు బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి అయితే వారి ఖాతా, చెడు అయితే మా ఖాతాలో వేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ ఆరోపించారు. సుంకిశాలను బీఆర్ఎస్ బృందం సందర్శిస్తోంది. విశ్రాంత ఇంజినీర్లను కూడా సుంకిశాల తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతల చిల్లర ప్రచారానికి ప్రకృతే సమాధానం చెబుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.