‘ఫోన్ ట్యాపింగ్’ నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ
27-04-2024 01:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల వాదనలు విని ముగ్గురు నిందితులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ను శుక్రవారం నాంపల్లి కోర్టు తిరస్కరించి కొట్టివేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నది. ఇదే కేసులో ఏ4 నిందితుడైన రాధాకిషన్రావు సైతం శుక్రవారం ఇదే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది.






