14-06-2025 12:00:00 AM
లబ్ధిదారులను స్వయంగా కలిసిన కమిషనర్ హరి కిరణ్
28 బార్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శంగా జరిగిందని వెల్లడి
రాజేంద్రనగర్,జూన్ 13: బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో ప్రశాంతంగా డ్రా ప్రక్రియ ముగిసిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన దరఖాస్తుదారులకు, ఎక్సైజ్ అధికారులందరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు రాష్ట్ర కమిషనర్ కమిషనర్ హరి కరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన డ్రాలో బార్లు దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు.
శనివారం నార్సింగి లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో జిహెచ్ఎంసి పరిధిలోని 24 బార్లకు 3,525 దరఖాస్తులు వచ్చాయి.దరఖాస్తుదారుల సమక్షంలో కమిషనర్ డ్రా తీశారు. డ్రా బాక్స్ లోని కమిషనర్ కాయిన్స్ తీసి ఇవ్వగా జాయింట్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ కే ఏ బి శాస్త్రి నెంబర్ దరఖాస్తుదారుల సమక్షంలో వెల్లడించారు.
డ్రా లో బార్ షాప్ గెలుపొందిన లబ్ధిదారులు అలాట్మెంట్ లెటర్ ని తీసుకొని వెళ్లాలని కమిషనర్ ప్రతి ఒక్కరిని కలిసి చెప్పారు. 90 రోజుల్లోగా బార్ల ప్రక్రియను పూర్తి చేసుకుని నడిపించుకోవాల్సిందిగా సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్లు పి. దశరథ్, కే ఏ బి శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డిలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని అన్ని డివిజన్ల ఈఎస్ లు అందరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు.
బాక్సులో కాయిన్స్ తీసిన జీవన్ కిరణాన్ని కూడా కమిషనర్ అభినందించారు. జిహెచ్ఎంసితోపాటు మిగిలిన నిజామాబాద్, మహబూబ్నగర్, జల్ పల్లి ప్రాంతాల్లో కూడా ప్ర శాంతంగా ముగిసిందని కమిషనర్ ఈ సందర్భంగావెల్లడించారు.