calender_icon.png 14 June, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం...

13-06-2025 11:34:41 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు సంజీవ రావు పంతులు సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవీసింగ్, గ్రామ నాయకులు సంకు లక్ష్మయ్య, పిట్ల సత్యనారాయణ, బాలరాజు, బూమేష్, నవీన్, ఉపాధ్యాయులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.