22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

28-09-2025 08:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆర్.బి.వి.ఆర్.ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి హాజరయ్యారు. ముందుగా బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి, కోలాటలు వేస్తూ.. బతుకమ్మ ఆడారు. దీంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కవిత రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ ఒక నిదర్శనమన్నారు. గౌరీ దేవి ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం సమకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వడ్డీ రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి దామోదర్ రెడ్డి, సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.