29-09-2025 07:17:57 PM
బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సోమవారం రాత్రి వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మల వద్ద మహిళలు బతుకమ్మ మాటలతో బతుకమ్మలను ప్రధాన వీధుల నుంచి గ్రామాలోని చెరువుల వద్దకు తీసుకెళ్లి నిమర్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామాలన్ని సందడి నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు ఉన్నారు.