19 May, 2026 | 1:21 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రవీందర్

06-08-2025 02:38 PM

నకిరేకల్,(విజయక్రాంతి): సైబర్ నేరాలపై(Cybercrime) ప్రజలు విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలని వాటిపై అవగాహన పెంచుకోవాలని కట్టంగూరు ఎస్సై మునుగోడు రవీందర్ కోరారు బుధవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో  విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ సిబ్బంది వెంకన్న సతీష్ దుర్గాప్రసాద్ శంకర్ శ్రీను, ఆ పాఠశాల ప్రిన్సిపల్ పోగుల   రాములు  ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.