17-06-2025 12:51:26 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట, జూన్ 16 (విజయక్రాంతి) : ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వేతల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 14 వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా 15 వ రోజు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ ఇండ్లలోని కూలర్లు, టైర్లు, చెట్ల తొట్టిలలో నీరు నిల్వ లేకుండా చేసి దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలన్నారు. గృహ, వాణిజ్య ,వ్యాపార సంస్థల వారు తమ ఇండ్లలోని చెత్తను తడి ,పొడి, హానికరమయిన చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహానాలకు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, డీ ఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీఎంసీ శ్వేత, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్,14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పంతంగి దశరద, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్,వార్డ్ అధికారి, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్,వార్డు సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..