15 April, 2026 | 11:58 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం

21-11-2025 10:34 PM

మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య

కాటారం,(విజయక్రాంతి): తేనే టీగల పెంపకంతో రైతులకు లాభదాయకమైన ఆదాయం సమకూరుతుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న తేనే టీగల పెంపకం శిక్షణ శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ తో కలిసి తిరుమల సమ్మయ్య ప్రారంభించారు.

కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటి ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ పద్ధతిలో తేనే టీగల పెంపకం చేపట్టేందుకు ఏడు రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు తేనే టీగల పెంపకం ద్వారా లాభాదాయ అదనపు వనరుగా ఉంటుందని అన్నారు.  పెంపకానికి అయ్యే ఖర్చు ఎన్ బి బి ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందన్నారు.  అలాగే వారం రోజుల పాటు జరిగే శిక్షణ లో పాల్గొనే రైతులకు భోజన వసతి కూడా ఉంటుందని తెలిపారు.