13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్లేఆఫ్స్‌కు బెంగళూరు

20-01-2026 12:00 AM

వడోదర, జనవరి 19 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచీ అదరగొడుతున్న ఆర్సీబీ ఐదో విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇప్పటి వరకూ ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ వేటలో దూసుకెళుతోంది. తాజాగా గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మృతి మంధానతో కలిసి గౌతమి నాయక్ జట్టును ఆదుకుంది.

మంధాన (26)తో కలిసి 60 పరుగులు, రిఛా ఘోష (27)తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. గౌతమి నాయక్ 55 బంతుల్లోనే 73(7 ఫోర్లు, 1 సిక్స్), రిఛా ఘోష్ 20 బంతుల్లో 3 సిక్సర్లతో 27 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో గుజరాత్ జెయింట్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. బెత్ మూనీ(3), సోఫీ డివైన్(0) , కనిక(0) డకౌటయ్యారు. గార్డనర్(54) హాఫ్ సెంచరీతో స్కోరు 100 దాటింది. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే 3, డిక్లార్క్ 2 వికెట్లు పడగొట్టింది.