15 June, 2026 | 9:30 PM

Breaking News

కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •  

విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఉత్తమ సేవల పురస్కారాలు

26-01-2026 09:02 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా నుంచి అత్యుత్తమ సేవలు అందించిన 9 మంది ఉద్యోగులకు విద్యుత్ శాఖ సిఎండి  కర్నాటి వరుణ్ రెడ్డి  చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల పురస్కారాలు అందుకున్నారు. కామా రెడ్డి జిల్లాలోవిశేష సేవలు అందించిన 21 మంది ఉద్యోగులకు  జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.

 గత సంవత్సరం సంభవించిన ఆకస్మిక వరదల సమయంలో అంకితభావంతో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన 230 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులకు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, కామారెడ్డి  రవీందర్  చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్  రవీందర్  మాట్లాడుతూ, అవార్డులు పొందిన ఉద్యోగులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులను ప్రోత్సహించారు.