10-05-2025 12:24:43 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్ నగర్ మే 7 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ కు చెందిన పలువురికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.