15 April, 2026 | 1:53 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

భైరవం వచ్చేది అప్పుడే

10-05-2025 12:20 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. ఈ చిత్రంలో అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లు కథానాయికలుగా నటిస్తున్నారు.

విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమాకు విడుదల తేదీని ప్రకటించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్‌ఫుల్ ఫెస్టివల్ వైబ్‌తో కనిపించి, ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: హరి కే వేదాంతం; సంగీతం: శ్రీచరణ్ పాకాల; మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్; సాహిత్యం: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్, బాలాజీ, తిరుపతి; ఫైట్స్: రామకృష్ణ, నటరాజ్ మడిగొండ; ఆర్ట్: బ్రహ్మ కడలి; ఎడిటర్: చోటా కే ప్రసాద్.