06-09-2025 12:00:00 AM
గాంధారి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల (ఎస్ జి టి) ఉపాధ్యాయురాలిగా బి.భవాని ఎంపికైనట్లు గాంధారి మండల విద్యాధికారి శ్రీహరి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల కార్యక్రమానికి బి. భవాని వెళ్లినట్లు తెలిపారు.