17 April, 2026 | 9:35 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టం

01-05-2025 01:35 AM

తాడ్వాయి, ఏప్రిల్, 30: భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్షన్ 4 ప్రకారం హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు, భూమి హక్కు లు ఉండి రికార్డులో లేని వారికి నమోదు చేయడం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు మ్యూటేషన్ చేసుకోవచ్చని తెలిపారు .

సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందన్నారు  తాసిల్దార్ ఇచ్చిన పాస్ పుస్తకాలపై  అభ్యంతరం ఉంటే ఆర్డిఓకు కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు రైతులు తమ సమస్యలపై భూభారతిలో పరిష్కారం పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ,ఎంపీడీవో సాజిద్ అలీ సింగల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి తహసిల్దార్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు