15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బైక్ దొంగ అరెస్ట్

03-02-2026 02:21 AM

మెదక్ టౌన్ సీఐ మహేష్

మెదక్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ సీఐ మహేష్ కేసు వివరాలను వెల్లడించారు. నర్సిములు అనే వ్యక్తి పని నిమిత్తం మెదక్కు వచ్చి, ఆటో నగర్లోని వన దుర్గ భవాని వైన్స్ షాప్ ముందు తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయగా, గుర్తు తెలియని వ్యక్తి బైక్ను దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం బోధన్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు.

విచారణలో అతని పేరు కమ్మరి రాములుగా గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అతడు పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడు గతంలో కూడా మెదక్, రామాయంపేట పరిసర ప్రాంతాల్లో అనేక ద్విచక్ర వాహన దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడని వెల్లడించారు. అతనిపై మెదక్, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ఆరు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి వద్ద నుండి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.