15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొంగలకు బుద్ధి చెప్పాలి

03-02-2026 02:20 AM

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో బిజెపి బీఫారం లు అందజేత

జిన్నారం/ అమీన్ పూర్ ఫిబ్రవరి 2: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని బిజెపి కార్యాలయంలో సోమవారం ఉదయం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ చేవెళ్ల ,సీనియర్ నాయకులు నరేందర్ ఆధ్వర్యంలో మాదారం 10వ వార్డు టేక్మల్ల రాజు, 11వ వార్డు  చెరుకుల మల్లేష్ యాదవ్, 12వ వార్డు ఠాకూర్ వీర బాయ్,13వ వార్డు కుతాడి రమేష్   అభ్యర్థులకు బీఫారం లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభ్యర్థులకు మనోదైర్యం నింపారు. ఎలాంటి భయాలకు లొంగకుండా ఎన్నికల్లో దూసుకుపోవాలని సూచించారు.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, నరేంద్ర మోడీ పాలన పై ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. రమణ సింగ్ మాట్లాడుతూ... బీజేపీ అంటే నమ్మకం తెలిపారు. అవినీతి రహిత పాలన కొరకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ ఎక్కువ సంఖ్యలో కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతి పై ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొంగలకు బుద్ది చెప్పాలని, బీజేపీని గెలిపించాలని కోరారు. అధ్యక్షుడు రాజు, రమణ సింగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.