లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి
ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. ప్రజలు ఏమైతే మాకేంటనే తీరులో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల కాలం లో మోదీ, కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ఇప్పు డు మళ్లీ ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చేందుకు ఆత్రుత కనబరుస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అనేక సంక్షే మ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ప్రజల గురించి ఆలోచిం చని కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ యాత్రలు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు వినోద్కుమార్, జహీర్ అఖ్తర్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, మిథున్రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, ఫయాజ్, బీ సుధాకర్రెడ్డి, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.