4 April, 2026 | 3:40 PM

Breaking News

రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •  

అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ

11-10-2025 12:46 AM

వికారాబాద్, అక్టోబర్ -10: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు టి. సదానంద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బిజెపి వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్ గౌడ్ అధ్యక్షతన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథి గా హాజరైన ఆయన మాట్లాడుతూ, బిజెపి పార్టీ గతంలో కంటే ఇప్పుడు చాలా బలపడిందన్నారు.

చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలిచినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫలాలు సామాన్యులకు అందుతున్నాయని పేర్కొన్నారు. హై కోర్టు స్టే ముగిసిన వెంటనే రాష్ర్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని, గ్రామీణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.

బిసిల రిజర్వేషన్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షులు సురేందర్, సూర్యప్రకాష్ ప్రశాంత్, రఘు, మోహన్ రెడ్డి, గొడుగు సుధాకర్, శ్రీకాంత్, అశోక్ , ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.