మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ మిత్రుడు అరెస్ట్
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ సహాయకుడు, అతని రిలయన్స్ పవర్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (Chief Financial Officer) అయిన అశోక్ కుమార్ పాల్ను నకిలీ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
రిలయన్స్ పవర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్ అరెస్టు రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీ రాకెట్కు సంబంధించినది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అశోక్ పాల్, జనవరి 29, 2023లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయన 7 సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్తో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ ఈడీ కేసు 2024లో ఆర్థిక నేరాల విభాగం (EOW) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్(First information report) ఆధారంగా రూపొందించబడింది. శనివారం అతన్ని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు. కస్టడీ విచారణ కోసం ఏజెన్సీ అతని రిమాండ్ను కోరుతుందని వర్గాలు తెలిపాయి.




