08-10-2025 07:57:30 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సాయిబాబా మందిరంలో పూజా, ధూప్ హారతిలో మనోహరాబాద్ మండలంలోని బీజేపీ నేతలు సాయిబాబాను దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యంగా చేస్తున్న ప్రతి వ్యాపారంలో రాజకీయంలో సాయిబాబా దీవెనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని సాయి బాబాను వేడుకున్నారు. ఇందులో బీజేపీ జిల్లా నాయకులు కాళ్లకల్ మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, ఏషం అనిల్ యాదవ్, కిరణ్ లు ఉన్నారు.