15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

“రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న బీజేపీ నేతలు

31-10-2025 03:11 PM

హైదరాబాద్: జాతీయ ఏకతా దివస్‌ సందర్భంగా నాంపల్లిలో నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ”(Run for Unity) కార్యక్రమంలో పాల్గొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సర్దార్ వల్లభభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. భారత స్వరాజ్య సంగ్రామానికి సమున్నత ముగింపు అందించిన క్రాంతదర్శి, నవభారత నిర్మాత, అద్భుత రాజనీతిజ్ఞుడైన సర్దార్ పటేల్ జీవితం ప్రతి భారతీయునికి ప్రేరణ. ఆయన ఐక్యత స్ఫూర్తి మన దేశ బలానికి మూలాధారని రామచందర్ రావు పేర్కొన్నారు. సంస్థానాల విలీనంలో ఆయన చూపిన వ్యూహం, సహనం, దూరదృష్టి స్వాతంత్ర్యానంతర భారత నిర్మాణానికి మార్గదర్శకం. ఆయన స్ఫూర్తితో యువతరం వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా యువ మోర్చా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు నివాళులర్పించారు.