2 July, 2026 | 10:52 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

12-09-2025 07:21 PM

29వ సార్లు రక్తదానం చేసిన సామాజికవేత్త బాబు నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సామాజికవేత్త బాబు నాయక్ అన్నారు.మండలంలోని తన స్వగ్రామైన గార కుంట తండా గ్రామానికి చెందిన ధరావత్ నాగేశ్వరరావు కి ఓపెన్ హార్ట్ సర్జరీ కారణంగా బి నెగిటివ్ బ్లడ్ అవసరం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కి వెళ్లి రక్తం అందించినట్లు తెలిపారు.ఆపదలో ఉన్నవారికి ఇప్పటికీ 29 సార్లు రక్తదానం చేసినట్లు ఆయన పాత్రికేయులకు తెలిపారు.బాబు నాయక్ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే నాకున్న కాళీ సమయంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేద, ధనిక, కులము, మతము అనే బేధం లేకుండా సేవ చేయడంలో తనకు తన కుటుంబానికి ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.