2 July, 2026 | 12:11 PM

Breaking News

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •  

విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలి

12-09-2025 07:15 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బందితో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జూనియర్ కళాశాలల పర్ఫామెన్స్ సహా పలు అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని ఆదేశించారు. కొన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని మెరుగుపరచాలని గట్టిగా చెప్పారు.

అదేవిధంగా అన్ని కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలని సూచించారు. విద్యార్థుల గైర్హాజరు ఎక్కువ లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకుల ఫేషియల్ అటెండెన్స్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. గతంలో పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనుల మాదిరిగానే విద్యార్థుల తల్లిదండ్రులచే కమిటీల ద్వారా తీర్మానం చేసి  కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం కళాశాలల ప్రిన్సిపల్స్ కమిటీ తీర్మానాలు చేసి ఇంజనీరింగ్ అధికారులకు సమర్పిస్తే వెంటనే పనులు ప్రారంభించి ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఆ దిశగా పనులు వేగవంతం చేసేందుకు ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.