13-01-2026 11:07:34 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ కేంద్రాలను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమీషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ సర్కిల్ లో అన్ని వార్డులలో ఎలక్ట్రానిక్ వ్యర్థలు (ఈ-వేస్ట్) సేకరణ అన్ని డివిజన్ లలో 12,13 తేదీలలో సేకరించడం జరిగింది. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు 2700 కేజీలను సేకరించి నాచారం సెంటర్ కు తరలించడం జరిగిందని డిప్యూటీ కమీషనర్ ఎ.శైలజ తెలిపారు.