17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంకు బాంబు బెదిరింపులు

08-05-2025 01:12 PM

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌లో గురువారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంతలో, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న  సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం(Sawai Mansingh Stadium)లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. జైపూర్‌ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. బెదిరింపులు రావడంతో స్టేడియం లోపల నుంచి అందర్నీ బయటకు పంపించి వేశారు. స్టేడియం చుట్టుపక్కల ఉన్నవారినీ జైపూర్‌ పోలీసులు ఖాళీ చేయించారు. బాంబు స్వ్కాడ్‌లు సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం లోపల, వెలుపల గాలిస్తున్నారు.